ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

మే, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆత్మీయులు కొత్తపల్లి సుబ్బరామయ్య గారు

 సుబ్బరామయ్యగారి గురించి రాయటం అంటే, నాకు ఒకరకంగా సాహసం తో కూడిన పని అనిపిస్తుంది. ఈయన వెండితెర నాయకుడు, గాయకుడు కాదు. కాని, ‘సామాజిక స్పృహ’ కలిగిన మానవతావాది. ఇటువంటి వ్యక్తి అనామకుడుగా సమాజంలో నిలిచిపోకూడదు అనే భావన ఈ నా రచనకు నాందిపలికింది. 1942వ  సంవత్సరమున - సంస్కృతి గ్రంథమండలి - చెన్నపట్నం వారు, నేటి జపాన్ అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఆ పుస్తక రచయిత మరెవరోకాదు, సుబ్బరామయ్య గారు. అందులో ఆయన తనని గురించి విషయాలు కొన్ని తెలిపారు. బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో (దాదాపు 110 సంవత్సరాల క్రితం) సుబ్బరామయ్య గారి తల్లిదండ్రులు ఒంగోలు నుంచి చెన్నపట్నంకి  వచ్చి జీవనం సాగించారు. అతిసామాన్యమైన మధ్యతరగతి కుటుంబం వారిది. ఆర్ధిక పరిస్ధితి అంతంతమాత్రమే. వీరి పై చదువులనాటికి ఆర్ధిక పరిస్ధితి బాగా కుంటుపడ్డది అని చెప్పాలి. ఆయన ఫిబ్రవరి 1వ తేదీ, 1910వ సంవత్సరంలో పెరంబూరు లో జన్మించారు. బాల్యం అంతా అక్కడే గడిచింది. విద్యాభ్యాసం అప్పటి గుంటూరు జిల్లా, ఒంగోలు లో పూర్తి చేసుకొని, 1928 నాటికి చెన్నపట్నం వచ్చి ఉద్యోగంలో చేరారు.  అవి ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం జరుగుతున్న రోజులు, 1931వ ప్రాంత...